Krishna: మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ..ఒకరు మృతి
ABN, First Publish Date - 2021-09-17T13:28:13+05:30
గుడివాడ రైల్వేస్టేషన్ దగ్గర మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. రాపాని ఏసు, బత్తుల సాయికుమార్లు మద్యం మత్తులో గొడవపడ్డారు
కృష్ణా: గుడివాడ రైల్వేస్టేషన్ దగ్గర మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. రాపాని ఏసు, బత్తుల సాయికుమార్లు మద్యం మత్తులో గొడవపడ్డారు. ఈ ఘర్షణలో బత్తుల సాయికుమార్పై రాపాని ఏసు గొడ్డలితో దాడి చేశాడు. దీంతో సాయికుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆస్పత్రి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయికుమార్ మృతి చెందాడు. కాగా, వీరిద్దరి మధ్య గొడవకు కారణాలు తెలియలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-09-17T13:28:13+05:30 IST