నేను మొదటి నుంచీ చెబుతూనే వున్నాను: మాజీ ఎంపీ
ABN, First Publish Date - 2021-11-20T21:25:20+05:30
వైసీపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని మాజీ ఎంపీ కొత్తపల్లి గీత మండిపడ్డారు. వైసీపీ నేతల వైఖరిపై తాను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నానని చెప్పారు.
అమరావతి: వైసీపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని మాజీ ఎంపీ కొత్తపల్లి గీత మండిపడ్డారు. వైసీపీ నేతల వైఖరిపై తాను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నానని చెప్పారు. భువనేశ్వరి పట్ల అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. నేతలను ఎన్నుకునే ముందు మహిళలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. క్యారెక్టర్ అసాసినేషన్ రాజకీయాలపై తీవ్రంగా ఖండించారు.
Updated Date - 2021-11-20T21:25:20+05:30 IST