AP: కొండపల్లి చేరుకున్న టీడీపీ కౌన్సిలర్లు
ABN, First Publish Date - 2021-11-22T15:39:26+05:30
కొండపల్లి చైర్మన్ ఎన్నిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభకానుంది.
అమరావతి: కొండపల్లి చైర్మన్ ఎన్నిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభకానుంది. కొద్దిసేపటి క్రితమే టీడీపీ కౌన్సిలర్లు కొండపల్లికి చేరుకున్నారు. కాగా కార్యాలయంలోకి కౌన్సిలర్లు సమయానికి చేరుకోకుండా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఎంపీ కేశినేనితో కలిసి 9:50 గంటలకు టీడీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10గంటలలోగా తమ హాజరును కమిషనర్కు కౌన్సిలర్లు ధృవీకరించాల్సి ఉంది. మరోవైపు వైసీపీ కౌన్సిలర్లు ఇంకా కౌన్సిల్ కార్యాలయానికి చేరుకోలేదు. సమావేశానికి హాజరు కావాలా.. వద్దా అనే మీమాంసలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ సభ్యులు పూర్తిస్థాయిలో హాజరుకావటంతో కోరంకు సంఖ్యాబలం సరిపోనుంది.
Updated Date - 2021-11-22T15:39:26+05:30 IST