మేం నలుగురిమే తిట్టేది.. మమ్మల్ని చాలా మందిని పెట్టి తిట్టిస్తున్నారు: కొడాలి నాని
ABN, First Publish Date - 2021-10-20T23:12:29+05:30
తాము నలుగురిమే తిట్టేదని, తమను చాలా మందిని పెట్టి తిట్టిస్తున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని...
అమరావతి: తాము నలుగురిమే తిట్టేదని, తమను చాలా మందిని పెట్టి చంద్రబాబు తిట్టిస్తున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని టీడీపీ నేత పట్టాభి చాలా అవమాన పర్చారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకూ ఎవర్నీ తిట్టలేదన్నారు. రోజుకో ప్రెస్మీట్ లేకపోతే చంద్రబాబుకు నిద్ర పట్టదని విమర్శించారు. చంద్రబాబు బతుకెంత... టీడీపీ కార్యాలయం ఎంత అని కొడాలి నాని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Updated Date - 2021-10-20T23:12:29+05:30 IST