ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్థాన్, చైనాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి: కిషన్ రెడ్డి

ABN, First Publish Date - 2021-08-19T16:20:03+05:30

దేశ సరిహద్దులో పాకిస్థాన్, చైనాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: దేశ సరిహద్దులో పాకిస్థాన్, చైనాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన తిరుపతిలోని అమరవీరుల సంస్మరణ స్థూపం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే ప్రయత్నం పాకిస్థాన్ చేస్తోందన్నారు. పాక్ చర్యలను తిప్పికొడతామన్నారు. మోదీ హయాంలో దేశంలో ఎక్కడా అల్లర్లు, ఉగ్రవాదుల దుశ్చర్యలు జరుగలేదన్నారు. దేశ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారని, దేశం కోసం త్యాగం చేసిన వారిని ఎప్పటికీ గుర్తించుకోవాలన్నారు. దేశ రక్షణ కోసం తిరుపతి లాంటి ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారన్నారు. సైనికుల కుటుంబాలకు అండగా ఉండాలని, వీరసతీమణుల ఆశీర్వాదం తీసుకోవాలని ప్రధానమంత్రి సూచించారని చెప్పారు. సైనికుల వల్లే దేశంలో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని, దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-08-19T16:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising