కేశినేని నానిపై చంద్రబాబు ప్రశంసలు
ABN, First Publish Date - 2021-12-02T00:00:11+05:30
కొండపల్లి టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఎన్నికల్లో పోటీచేసిన, పనిచేసిన కార్యకర్తలు
అమరావతి: కొండపల్లి టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఎన్నికల్లో పోటీచేసిన, పనిచేసిన కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. కొండపల్లి ఎన్నికల్లో ఎంపీ కేశినేని పాత్రపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. నేతలను, కార్యకర్తలను కేశినేని బాగా కోఆర్డినేట్ చేశారని కొనియాడారు. సమర్థులైనవారికి అవకాశం ఇవ్వకపోవడం వల్లే.. కొన్ని చోట్ల నష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు. నేటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయన్నారు. ఇకపై నియోజకవర్గస్థాయి నుంచి సమర్థులకే పెద్దపీట వేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
Updated Date - 2021-12-02T00:00:11+05:30 IST