కేసీఆర్ను అడిగే దమ్ము జగన్కు లేదు: కాల్వ శ్రీనివాసులు
ABN, First Publish Date - 2021-08-07T20:42:32+05:30
శ్రీశైలం డ్యాంను రాయలసీమ టీడీపీ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మీడియాతో
కర్నూలు: శ్రీశైలం డ్యాంను రాయలసీమ టీడీపీ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ పేదరికాన్ని వెనుకబాటు తనాన్ని వైఎస్ కుటుంబం ఓట్లుగానే చూసిందే తప్ప సమస్యల పరిస్కారానికి ప్రయత్నం చేసింది లేదని దుయ్యబట్టారు. కృష్ణాజలాలపై రాయలసీమ వాసులకు మొట్టముదటి సారిగా నీటి హక్కును మాజీ సీఎం నందమూరి తారకరామారావు కల్పించారని గుర్తుచేశారు. శ్రీశైలం జలాశయంలోని నీటి వాటలను రెండు రాష్ట్రాలకు చెరి సగం కావాలని కేసీఆర్ను అడుగుతుంటే ఆయనను అడిగే దమ్ము సీఎం జగన్కు లేదని ఎద్దేవాచేశారు. రాయలసీమ లిప్ట్ పేరుతో ప్రచార ఆర్భాటం తప్ప జగన్ రెండేళ్ల పాలనలో రాయలసీమకు చేసిందేమిలేదు అంతా శూన్యమని తప్పుబట్టారు. రాయలసీమ హక్కులను కాపాడుకునేందు శ్రీశైలం నుంచి పోరాటం ప్రారంభించామని కాల్వ శ్రీనివాసులు తెలిపారు.
Updated Date - 2021-08-07T20:42:32+05:30 IST