కేంద్రం నిధులను దారి మళ్లించారు: కనకమేడల
ABN, First Publish Date - 2021-07-18T01:55:15+05:30
కేంద్రం నిధులను దారి మళ్లించారు: కనకమేడల
ఢిల్లీ: ప్రజా సమస్యలు చర్చకు సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ప్రాంతీయ పార్టీలకు సమయం ఇవ్వాలని అఖిలపక్ష సమావేశం కోరినట్లు ఎంపీ కనకమేడల రవీంద్ర తెలిపారు. ఏపీ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. అలాగే ఏపీలో కేంద్రం నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేక కేంద్రంపై నెపం వేస్తోందని మండిపడ్డారు. స్టీల్ప్లాంట్పై కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
Updated Date - 2021-07-18T01:55:15+05:30 IST