‘కమ్మ మహిళలను కించపరిస్తే ఎంతంటి వారినైనా ఉపేక్షించం..!’
ABN, First Publish Date - 2021-11-20T12:56:36+05:30
కమ్మ సామాజిక వర్గ మహిళలను కించపరిస్తూ మాట్లాడితే..
చిత్తూరు జిల్లా/శ్రీకాళహస్తి : కమ్మ సామాజిక వర్గ మహిళలను కించపరిస్తూ మాట్లాడితే ఎంతంటి వారినైనా ఉపేక్షించేది లేదని శ్రీకాళహస్తి నియోజకవర్గ కమ్మ సంఘం అధ్యక్షుడు ఉన్నం వినీష్ చౌదరి హెచ్చరించారు. కమ్మ మహిళ వ్యక్తిత్వాన్ని దేవాలయం లాంటి అసెంబ్లీలో కించపరుస్తూ మాట్లాడటం వైసీపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. కోట్లాదిమంది ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకుని అసెంబ్లీకి పంపిస్తే అక్కడ ప్రజా సమస్యలను గాలికి వదలి నీచంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. వైసీపీ నేతలను ప్రజలు తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు సతీమణిని కించపరుస్తూ మాట్లాడిన మాటలను వెనక్కు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Updated Date - 2021-11-20T12:56:36+05:30 IST