ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ ప్రోద్బలంతోనే చంద్రబాబుపై దాడి: కళా వెంకట్రావు

ABN, First Publish Date - 2021-04-13T19:47:24+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రోద్బలంతోనే తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడి జరిగిందని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రోద్బలంతోనే తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడి జరిగిందని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా నాయకులపై ఎన్ని దాడులు చేసినా తిరుపతిలో వైసీపీకి ఓటమి తప్పదని హెచ్చరించారు. వైసీపీ అవలంబిస్తున్న రాజారెడ్డి రాజ్యాంగానికి రాళ్లదాడే ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. ప్రజలను మెప్పించి ఓట్లు పొందడం చేతగాక.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై దాడి చేసిన వారిని వెంటనే  అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.  చంద్రబాబు సభలకు తగిన రక్షణ కల్పించాలని వైసీపీ ప్రభుత్వాన్ని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-04-13T19:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising