ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య కాపురానికి రాలేదని.. భర్త ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-10-20T04:39:30+05:30

భార్య కాపురానికి రాలేదని మనస్తాపంతో భర్త బోయన సుబ్బరాయుడు (42) ఉరివేసుకున్న సంఘటన శాటిలైట్‌ సిటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

సుబ్బరాయుడు మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నూరు, అక్టోబరు 19: భార్య కాపురానికి రాలేదని మనస్తాపంతో భర్త బోయన సుబ్బరాయుడు (42) ఉరివేసుకున్న సంఘటన శాటిలైట్‌ సిటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. చెన్నూరు వాసి బోయన సుబ్బరాయుడు సునీతను 2011లో వివా హం చేసుకుని, శాటిలైట్‌ సిటీలో కాపురం ఉండే వారు. వివాహమైన ఆరు నెలలకే బతుకుదెరువు నిమిత్తం సునీత కువైత్‌కు వెళ్లింది. ఏమైందో ఏమో కానీ అప్పటి నుంచి ఆమె తిరిగిరాలేదు.

ఇంటికి రమ్మని భర్త ఎన్నిసార్లు ఫోను చేసినా స్పందించలేదు. పలువురు పెద్దమనుషుల ద్వారా చెప్పించినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్థాపానికి గురైన సుబ్బరా యుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం అర్ధరాత్రి ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఈయన చెన్నూరులో ఓ మినీ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ను నడుపుతుండేవాడని స్థానికులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2021-10-20T04:39:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising