ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురపోరులో విజయం సాధిస్తాం

ABN, First Publish Date - 2021-02-25T04:32:39+05:30

వైసీపీ ప్రజావ్యతిరేక విధానాల తో ప్రజలు విసిగిపోయారని, టీడీపీ వైపే ఉన్నారని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న మల్లెల లింగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, ఫిబ్రవరి 24 : వైసీపీ ప్రజావ్యతిరేక విధానాల తో ప్రజలు విసిగిపోయారని, టీడీపీ వైపే ఉన్నారని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ తమ పరిధిలో కడప కార్పొరేషన్‌ సహా ఏడు నియోజకవర్గాల్లో జరిగే పురపోరులో టీడీపీకే విజయావకాశాలు ఉన్నాయన్నారు. పురపాలక ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే వైసీపీ నాయకులు టీడీపీ వారిని ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటున్నారన్నారు. ఇలాంటి వారు పార్టీ వీడినా, పార్టీకి ఎలాంటి ఢోకా లేదన్నారు. కార్యకర్తలే త మ బలమని, వారికి పార్టీ ఎప్పటికి అండగా ఉంటుందన్నారు. కూరగాయల మార్కెట్‌ అధునీకరణ పేరిట నిరుపేద ముస్లిం మైనార్టీలకు నీడలేకుండా చేశారని లింగారెడ్డి దుయ్యబట్టారు. జగన్‌ సర్కార్‌ ఇంటి పన్నుల పెంపుకు సిద్దమైందని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో విఫలమైందన్నారు. ప్రజలు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని, ము న్సిపోల్స్‌లో టీడీపీ అభ్యర్థులను బలపరచి, వైసీపీకి తగిన బుద్ది చెప్పాలని ఆయన పిలుపు ఇచ్చారు. సమావేశంలో టీడీపీ పట్టణ నాయకులు ఏసుదాసు, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T04:32:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising