ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ కబ్జాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలను అడ్డుకుంటాం

ABN, First Publish Date - 2021-06-21T05:12:09+05:30

రాజంపేట నియోజకవర్గంలో కొందరు వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతూ టీడీపీకి చెందిన వారిని ఇబ్బందులపాలు చేస్తున్నారని వారి ఆగడాలను అడ్డుకుంటామని రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి బత్యాల చెంగల్‌రాయులు హెచ్చరించారు.

బోయనపల్లెలో వివాదాస్పద స్థలాన్ని పరిశీలిస్తున్న బత్యాల చెంగల్‌రాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బత్యాల  

రాజంపేట, జూన్‌20 : రాజంపేట నియోజకవర్గంలో కొందరు వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతూ టీడీపీకి చెందిన వారిని ఇబ్బందులపాలు చేస్తున్నారని వారి ఆగడాలను అడ్డుకుంటామని రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి బత్యాల చెంగల్‌రాయులు హెచ్చరించారు. ఆదివారం రాజంపేట మండలం తాళ్లపాక పంచాయతీ బోయనపల్లె ప్రాంతంలో కొంత మంది వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీకి చెందిన టి.వెంకటసుబ్బయ్య స్థలాన్ని కబ్జా చేసి దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివాదాస్పదంగా మారిన ఆ స్థలాన్ని పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేటలో వైసీపీ నేతలు అభివృద్ధి మరిచి ప్రభుత్వ భూములను ఆక్రమించడం, డీకేటీ భూములను అక్రమాలను చేయడం, పేదల భూములను కబ్జా చేయడం, భూ కబ్జాలనే ఆదాయ వనరుగా మార్చుకోవడం జరిగిందన్నారు. వైసీపీ ఆక్రమణలను ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోవూరు సుబ్రహ్మణ్యంనాయుడు, బోయనపల్లె మాజీ ఎంపీటీసీ అద్దె ప్రతా్‌పరాజు, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ పార్లమెంట్‌ అధ్యక్షుడు రేవూరి వేణుగోపాల్‌, బీసీ నాయకులు ఇడిమడకల కుమార్‌, స్థానిక నాయకులు నరసింహులు, మురళీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T05:12:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising