ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసు.. తెరపైకి కొత్త పేర్లు

ABN, First Publish Date - 2021-06-22T15:44:02+05:30

వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. 16 వ రోజు మంగళవారం అధికారులు విచారణ జరుపుతున్నారు. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చారు. ఇవాళ పులివెందుల, ఇతర ప్రాంతాల నుంచి కొందరు అనుమానితులు అధికారుల ముందు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.


కాగా సోమవారం సీబీఐ అధికారులు కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో ఆరుగురిని విచారించారు. వైఎస్‌ వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డిని ఏడుగంటల పాటు విచారించారు. అలాగే కడపకు చెందిన ఉపాధ్యాయుడు రవిశంకర్‌, పులివెందులకు చెందిన క్రిష్ణయ్య, సావిత్రి దంపతులు,   వారి కుమారులు కిరణ్‌కుమార్‌ యాదవ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌లను ఏడు గంటల పాటు ప్రశ్నించి వారి నుంచి సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. కడపకు చెందిన ఉపాధ్యాయుడి ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ మహిళను విచారించినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-06-22T15:44:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising