జిల్లా వాసికి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రశంసలు
ABN, First Publish Date - 2021-03-07T05:13:28+05:30
జిల్లా విద్యాశాఖ రీసోర్స్ పర్సన్గా, నందిమండలం జడ్పీ హైస్కూలులో ఇంగ్లీషు స్కూలు అసిస్టెంటుగా పనిచేస్తున్న గునిశెట్టి శ్రీనివాసులుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నుంచి వ్యక్తిగతంగా ప్రత్యేక ప్రశంసలు లభించాయు.
కడప (ఎడ్యుకేషన్ల్), మార్చి 6 : జిల్లా విద్యాశాఖ రీసోర్స్ పర్సన్గా, నందిమండలం జడ్పీ హైస్కూలులో ఇంగ్లీషు స్కూలు అసిస్టెంటుగా పనిచేస్తున్న గునిశెట్టి శ్రీనివాసులుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నుంచి వ్యక్తిగతంగా ప్రత్యేక ప్రశంసలు లభించాయు. ఆర్థిక మంత్రిత్వ శాఖ మెయిల్ ద్వారా ఈ మేరకు సందేశం అందుకున్నారు. కేంద్ర బడ్జెట్ 2021-22 సంబంధించి ఈయన మైజీవోవి.ఇన్ పోర్టల్ ద్వారా పంపిన వివిధ అంశాల సూచనలు విలువైనవిగా భావిస్తూ కేంద్ర బృందానికి అవి తోడ్పడినట్లు తెలియజేస్తూ ఆ మేరకు మెయిల్ ద్వారా ధన్యవాదాలు తెల్పుతూ ప్రశంసా సందేశాన్ని పంపించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారిణి శైలజతో పాటు పలువురు గునిశెట్టి శ్రీనివాసులును అభినందించారు.
Updated Date - 2021-03-07T05:13:28+05:30 IST