ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోపిడీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

ABN, First Publish Date - 2021-10-24T04:59:54+05:30

కదిరి రోడ్డు మార్కెట్‌యార్డు చెక్‌పోస్టు వద్ద ఈనెల 18న జరిగిన దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

నిందితుల అరెస్టును చూపుతున్న సీఐ భాస్కర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల టౌన్‌, అక్టోబరు 23: కదిరి రోడ్డు మార్కెట్‌యార్డు చెక్‌పోస్టు వద్ద ఈనెల 18న జరిగిన దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ నిందితులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వాసులు యువరాజ్‌ పవార్‌, అన్నకొడుకు రాజనటరాజ్‌ పవార్‌ ఇద్దరు కలిసి మార్కెట్‌యార్డు చెక్‌ పోస్టు వద్ద రోడ్డుపక్కన నిలిపి ఉన్న సిమెంట్‌ లారీ వెనుక వైపు క్యాబిన్‌ను రా యితో పగులకొట్టి లోపలికి ప్రవేశించారన్నారు. డ్రైవర్‌ను కత్తితో బెదిరించి రూ.14 వేలు నగదు, సెల్‌ఫోన్‌ను తీసుకుని పారిపోయారన్నారు.

అనంతరం వీరు ముద్ద నూరు, చిలంకూరు, యర్రగుంట్ల పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ మళ్లి పులివెం దుల టౌన్‌కు బైకులో వస్తుండగా వారిని శనివారం అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ.7వేలు నగదు, సెల్‌ఫోన్‌, కత్తి, యమహా బైకును స్వాధీనం చేసుకు న్నామన్నారు. ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T04:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising