ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల పాలిట శాపంగా మారిన జగన్ పాలన: Tulasi Reddy

ABN, First Publish Date - 2021-11-09T20:07:30+05:30

జగన్మోహన్ రెడ్డి పాలన రైతుల పాలిట శాపంగా మారిందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప జిల్లా: జగన్మోహన్ రెడ్డి పాలన రైతుల పాలిట శాపంగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. మంగళవారం కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అతివృష్టివల్ల రైతులు అంతకంటే ఎక్కువ నష్టపోతున్నారన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట మొత్తం నేలకొరిందని, ఒక్క వడ్లగింజ కూడా చేతికొచ్చే పరిస్థితిలేదన్నారు. దాదాపు ఎకరాకు రూ. 30 వేలు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాటలు చెప్పకుండా వెంటనే నివేదికలు తెప్పించుకుని రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-09T20:07:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising