కరోనా మృతులకు నివాళి
ABN, First Publish Date - 2021-05-13T04:54:35+05:30
కరోనా మృతులకు టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, ఆయన సతీమణి, టీడీపీ మహిళా నాయకురాలు లక్ష్మీప్రసన్నలతో కలిసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
ప్రొద్దుటూరు క్రైం, మే 12 : కరోనా మృతులకు టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, ఆయన సతీమణి, టీడీపీ మహిళా నాయకురాలు లక్ష్మీప్రసన్నలతో కలిసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు బుధవారం సాయంత్రం ఆయన తన నివాసంలో కొవ్వొత్తులతో కరోనా మృతులకు తీవ్ర సంతాపం తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది కరోనా రోగులు బెడ్డు, అక్సిజన్ అందక మృత్యువాత పడుతున్నారని, ఈ మరణాలతోనైనా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల న్నారు. కరోనా బాధితులకు ఆస్పత్రిలో బెడ్డు, అక్సిజన్ సౌకర్యం కల్పించి ప్రాణాలు కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2021-05-13T04:54:35+05:30 IST