రైతులకు శిక్షణ కార్యక్రమం
ABN, First Publish Date - 2021-08-04T05:09:13+05:30
రాజంపేట, నందలూరు మండలాల పరిధిలోని తాళ్లపాక, పాటూరు గ్రామాల్లో మంగళవారం జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాజంపేట, ఆగస్టు3 : రాజంపేట, నందలూరు మండలాల పరిధిలోని తాళ్లపాక, పాటూరు గ్రామాల్లో మంగళవారం జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రామాల్లో ప్రధానంగా వరిపంట సాగు చేయడం వల్ల వరిపంట సాగులో మెళుకువలు, అధిక దిగుబడికి తీసుకోవాల్సిన చర్యలు, ఎరువుల వాడకం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. డాట్ సెంటర్ కో-ఆర్డినేటర్ కె.పద్మోదయ, ఆత్మా డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ ఐ.జె.మైఖెల్రాజు, రైతు శిక్షణ సహాయ సంచాలకురాలు కె.లక్ష్మీదేవి, డాట్ టెక్నాలజీ మేనేజర్ ఓ.బి.సుబ్రహ్మణ్యంకుమార్, వ్యవసాయ సహాయకులు జయపాల్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-04T05:09:13+05:30 IST