ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగనాయకులపేటలో చోరీ

ABN, First Publish Date - 2021-03-25T04:36:41+05:30

పట్టణంలోని రంగనాయకులపేటలో బుధవారం తెల్లవారుజామున యార్రా చెంగల్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

9 తులాల బంగారు నగలు, రూ.లక్ష  అపహరణ


రైల్వేకోడూరు రూరల్‌, మార్చి 24: పట్టణంలోని రంగనాయకులపేటలో బుధవారం తెల్లవారుజామున యార్రా చెంగల్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. రైల్వేకోడూరు ఎస్‌ఐ-1 పెద్ద ఓబన్న కథనం మేరకు...వెంకటరెడ్డిపల్లెకు చెందిన చెంగల్‌రెడ్డి రైల్వేకోడూరు పట్టణంలోని రంగనాయకులపేటలో నివాసం ఉంటున్నాడు. అతడి భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని 9 తులాల బంగారం, రూ.లక్ష నగదును దొంగిలించుకుని పోయినట్లు ఎస్‌ఐ వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


కోడూరులో గుట్కా పట్టివేత


రైల్వేకోడూరు, మార్చి 24: పట్టణంలోని పాతబస్టాండు వద్ద బుధవారం రైల్వేకోడూరు పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా మోటారు సైకిల్‌లో అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుకున్నారు. రైల్వేకోడూరు ఎస్‌ఐ-1 పెద్ద ఓబన్న కథనం మేరకు...మైనర్‌ బాలుడు మోటారు సైకిల్‌లో గుట్కా ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్నామని ఆయన వివరించారు. వాటి విలువ రూ.20 వేలు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 

Updated Date - 2021-03-25T04:36:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising