గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి
ABN, First Publish Date - 2021-01-25T04:53:30+05:30
గ్రామ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చే యాలని రాజంపేట పార్లమెంటరీ ఆ పార్టీ అధ్యక్షుడు ఏవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.
రాయచోటి, జనవరి24: గ్రామ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చే యాలని రాజంపేట పార్లమెంటరీ ఆ పార్టీ అధ్యక్షుడు ఏవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన రాయచోటి పట్టణంలోని ప్రతిభా జూనియర్ కళాశాలలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాలివీడు, లక్కిరెడ్డిపల్లె మండలాలకు బీజేపీ అధ్యక్షులుగా శ్రీనివాసరెడ్డి, వెంకట్రమణరాజును నియమించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని రాయచోటి వ్యాప్తంగా మరింత బలోపేతం చేయాలని సూచించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు నిర్మల్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పులి నరేంద్రకుమార్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రెడ్డెమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు శివగంగిరెడ్డి, పట్టణ మాజీ కార్యదర్శి బాలాజీయాదవ్, ధార్మిక సెల్ జిల్లా నాయకులు ఆనంద గజపతిరాజు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-25T04:53:30+05:30 IST