గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన గర్హనీయం
ABN, First Publish Date - 2021-01-27T05:16:40+05:30
గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తన ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన తేవడం గర్హనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వేంపల్లె, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తన ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన తేవడం గర్హనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వికేంద్రీకరణ చట్టం కేసు హైకోర్టు విచారణలో ఉండగా ఈ పరిస్థితుల్లో గవర్నర్ తన ప్రసంగంలో మూ డు రాజధానుల ప్రస్తావన తేవడం అసమంజసమన్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తాననడం హా స్యాస్పదమన్నారు. ఒకవైపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఒక రాష్ట్రం, ఒకే రాజధాని అది అమ రావతే అని నినదిస్తున్నారన్నారు. 400రోజులకు పైబడి రా జధాని అమరావతి ప్రాంత రైతులు, మహిళలు రాజధాని అమరావతి పరిరక్షణ కోసం గాంధేయపద్ధతిలో ఉద్య మిస్తున్నారన్నారు. నిన్నటి సుప్రీం కోర్టు తీర్పు తోనైనా జగన్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగకపోవడం శోచనీయమన్నారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో రైతు ఉద్యమం హింసాత్మకంగా మారడం దురదృష్టకర మన్నారు. రాహుల్గాంధీ చెప్పినట్లు హింస సమ స్యలకు పరిష్కారం కాదు, మహాత్ముని అహింసా మార్గమే సమస్యలకు పరిష్కారమన్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంతానికి పోకుండా రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలన్నారు.
Updated Date - 2021-01-27T05:16:40+05:30 IST