ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటు ఆనందం - ఇటు ఆందోళన

ABN, First Publish Date - 2021-07-23T05:08:58+05:30

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు ఆనందాన్ని కలిగిస్తున్నా మరో వైపు ఆందోళన కలిగిస్తున్నాయి.

వర్షానికి ఊపిరి పోసుకుంటున్న వరిపంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపవరం, జూలై 22: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు ఆనందాన్ని కలిగిస్తున్నా మరో వైపు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొందరు వరినాట్లు వేస్తుండగా ఇప్పటికే సజ్జ, పత్తి పంటలు సాగు చేసిన రైతులు పెట్టుబడు లు కూడా రావని ఆవేదనకు లోనవుతున్నా రు.  గోపవరం, బేతాయపల్లె, బెడుసుపల్లె, రాచాయిపేట తదితర ప్రాంతాల్లో సజ్జ పం ట సాగు చేశారు. ప్రస్తుతం ఇది పొట్టదశ లో ఉంది. సుమారు 400 ఎకరాలకు పైగా సాగు చేసిన పంట ప్రస్తుత వర్షాలకు దెబ్బతింటుందేమోనన్న ఆందోళనలో రైతన్నలు న్నారు. ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే సజ్జ పూర్తిగా దెబ్బతింటుందని, పెట్టుబడులు కూడా రావని రైతులు వాపోతున్నారు.

కాల్వపల్లె పంచాయతీలో కొన్ని చోట్ల వరి సాగులో ఉండగా మరికొన్ని చోట్ల పత్తి సా గులో ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వరి పంటకు అనుకూలమైతే, మట్టి కూడా పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 



Updated Date - 2021-07-23T05:08:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising