భయబ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీ : బీజేపీ
ABN, First Publish Date - 2021-10-25T05:08:27+05:30
ఉప ఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేయ డం కోసం ప్రతిపక్ష నేతలను అరెస్టుచేసి వైసీపీ భయబ్రాంతులకు గురిచేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బద్వేలు,అక్టోబరు 24: ఉప ఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేయ డం కోసం ప్రతిపక్ష నేతలను అరెస్టుచేసి వైసీపీ భయబ్రాంతులకు గురిచేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగం గా ఆయన విలేకర్లతో మాట్లాడు తూ రెండేళ్లలో వైసీపీ అరాచకాలకు పాల్పడిందని ప్రజా సమస్యలను గాలికొదిలేసి అక్రమవ్యాపారాలపై దృష్టిపెట్టింద ని ఆరోపించారు.
ఒక నియోజకవర్గం ఉప ఎన్నికకు మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంతమందిని నియమించడం అవసరమాఅని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందని ఉప ఎన్నికలో ఓడిపోతామన్న భయాందోళన అధికారపార్టీలో మొదలైందన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ధనార్జనే ద్యేయంగా పాలన కొనసాగిస్తున్నారన్నారు.
Updated Date - 2021-10-25T05:08:27+05:30 IST