ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించాలి

ABN, First Publish Date - 2021-11-28T05:01:46+05:30

విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలని ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి అన్నా రు.

అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ను పరిశీలిస్తున్న ఆర్జేడీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వల్లూరు, నవంబరు 27: విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలని ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి అన్నా రు. శనివారం గంగాయపల్లెలోని ఆదర్శ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ఆదర్శ పాఠశాలలో ఉన్న అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ను పరిశీలించారు. అక్కడ విద్యార్థులు చేస్తున్న ప్రయోగాలను పరిశీలించారు. అడిగిన ప్రశ్నలకు విద్యార్థుల నుంచి సమాధానాలు తెలుసుకొన్నారు. అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ ద్వారా సైన్స్‌పై మరింత అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అలా కల్పించినప్పుడే వారిలోని పరిజ్ఞానం మరింత పెరిగి విద్యార్థుల ఉన్నతికి అది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి స్థానిక ఉపాధ్యాయులతో లెసన్‌ ప్లానింగ్‌ గురించి చర్చించారు. విద్యార్థులకు మంచి బోధన అందిస్తే వారి అభివృద్ధితో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందపడతారన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రిన్సిపాల్‌ దిలీ్‌పకుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-28T05:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising