రేషన్ బియ్యం సరఫరా చేయండి
ABN, First Publish Date - 2021-06-14T05:09:00+05:30
పట్టణంలోని 16వ వార్డులో ఈనెలకు సంబం ధించి రేషన్ బియ్యం వెంటనే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
అధికారులకు 16వ వార్డు కార్డుదారుల వినతి
జమ్మలమడుగు రూరల్, జూన్ 13: పట్టణంలోని 16వ వార్డులో ఈనెలకు సంబం ధించి రేషన్ బియ్యం వెంటనే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఈనెల 14వ తేదీ వచ్చినా తమకు ఇంతవ రకు బియ్యం పంపిణీ చేయ లేదని ఈ విషయమై తమ వార్డులోని 4, 5 షాపులకు సం బంధించిన డీలర్లు ను అడిగినా పట్టించుకోవడంలేదని వాపోయా రు. ఆ మేరకు ఆదివారం 16వ వార్డులోని మహిళలు రేషన్ బియ్యం ఇవ్వలేదంటూ స్థానిక విలేకర్ల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి బియ్యం పంపిణీ చేయలేదని, బియ్యం ఇవ్వాలని అడుగుతున్నా తమకు మీ కార్డులు సంబంధం లేదని చెబుతున్నారని సమస్యను తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. బియ్యం పంపిణీ ప్రతినెల సమస్యగానే ఉందని వాపోయారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దారు మధుసూదన్రెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా 16వ వార్డులో రేషన్ బియ్యం పంపిణీపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించిన షాపు డీలర్లను పిలిచి వారితో మాట్లాడి లబ్ధిదారులందరికీ బియ్యం అందేలా చూస్తామని ఆయన తెలిపారు.
Updated Date - 2021-06-14T05:09:00+05:30 IST