ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేడుకగా సౌమ్యనాఽథస్వామి కల్యాణం

ABN, First Publish Date - 2021-07-24T05:57:12+05:30

నందలూరులోని సౌమ్యనాఽథుని కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథస్వామికి ఆగమశాస్త్ర పండితులు ఏవీకే నరసింహాచార్యులు, అఖిల్‌ దీక్షితులు, అనంత శర్మ, శివమోహన ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రత్యేక అలంకరణలో స్వామి అమ్మవార్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందలూరు, జూలై 23 : నందలూరులోని సౌమ్యనాఽథుని కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథస్వామికి ఆగమశాస్త్ర పండితులు ఏవీకే నరసింహాచార్యులు, అఖిల్‌ దీక్షితులు, అనంత శర్మ, శివమోహన ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉభయదారులుగా మేడా విజయశేఖర్‌రెడ్డి దంపతులు వ్యవహరించారు. అనంతరం ఉత్సవమూర్తులను ముస్తాబు చేసి మేళతాళాల మధ్య కల్యాణ వేదికపైన ఆశీనులు గావించారు. పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ మధ్య ఉదయం లభిజిత లగ్నంలో కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. మేడా విజయభాస్కర్‌రెడ్డి దంపతులు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. భక్తులకు మేడా రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కల్యాణ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఆర్టీసీ మాజీ రీజనల్‌ చైర్మన ఎద్దల సుబ్బరాయుడు తదితరులు హాజరయ్యారు. కల్యాణం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాఽథస్వామిని ఆలయం చుట్టూ పల్లకిలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం రథోత్సవం నిర్వహించనున్నారు.

Updated Date - 2021-07-24T05:57:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising