రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
ABN, First Publish Date - 2021-10-18T05:53:24+05:30
మండల పరిధిలోని కర్నూతుల పంచాయతీ అగ్రహారం వద్ద ఆదివా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
లక్కిరెడ్డిపల్లె, అక్టోబరు 17: మండల పరిధిలోని కర్నూతుల పంచాయతీ అగ్రహారం వద్ద ఆదివా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు... మండల పరిధిలోని పందిళ్లపల్లెకు చెందిన ఆంజనేయులు పని నిమిత్తం ద్విచక్రవాహనంపై లక్కిరెడ్డిపల్లెకు వస్తుండగా మార్గమధ్యంలో ఆగ్రహారం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బొలేరో పికప్ వాహనం ఢీకొంది. దీంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వినోద్కుమార్ వివరించారు.
Updated Date - 2021-10-18T05:53:24+05:30 IST