విద్యుత్ అంతరాయం లేకుండా చూడండి
ABN, First Publish Date - 2021-04-16T04:38:53+05:30
పట్టణంలోని నెహ్రూనగర్ వీధిలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ప్రజలు విద్యుత్ అధికారులను కోరారు.
జమ్మలమడుగు రూరల్, ఏప్రిల్ 15:పట్టణంలోని నెహ్రూనగర్ వీధిలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ప్రజలు విద్యుత్ అధికారులను కోరారు. ఆ మేరకు గురువారం డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకు మార్, స్థానికులు ఏఈ లక్ష్మినారాయణను కలిసి వినతి పత్రం అందజేశారు. ట్రాన్స్ఫార్మర్ లోఓల్టేజీ వలనే విద్యు త్ సమస్య ఉందన్నారు. చిన్నపాటి గాలిపెట్టినా కరెంటు నిలువడంలేదన్నారు. ప్రస్తుతం రంజాన్ మాసం కావడం వలన ఆ ప్రాంతంలో ముస్లింలు కరెంటు కష్టాలతో ఇబ్బం దులు పడుతున్నారని వారు వాపోయారు. నిత్యం కరెంటు కోతలు ఉండటం వలన సమస్యగా ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో విద్యుత్ సమస్య లేకుండా చూడాలని వారు కోరారు. డీవైఎఫ్ఐ సభ్యులు యల్లయ్య, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-04-16T04:38:53+05:30 IST