ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగి మృతి

ABN, First Publish Date - 2021-10-18T05:41:26+05:30

మండలంలోని కె.ఎర్రగుడి గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యో గి రెడ్డిశేఖర్‌రెడ్డి (35) మృతి చెందాడు.

మృతి చెందిన రెడ్డిశేఖర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాయపేట, అక్టోబరు 17: మండలంలోని కె.ఎర్రగుడి గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యో గి రెడ్డిశేఖర్‌రెడ్డి (35) మృతి చెందాడు. సంఘటనకు సంబంధించి చక్రాయపేట ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి వివరాలు వెల్లడించారు. రెడ్డిశేఖర్‌రెడ్డి తన అత్తగారింటికి భార్య పవిత్రతో కలిసి శనివారం కడప నుంచి అనంతపురం జిల్లా ఎన్‌పీకుంట మండలం వెలిచెలమల గ్రామం వెళుతున్నారు. కె.ఎర్రగుడి గ్రామ సమీపాన వంక దాటుతుడగా ఆ వంకలో పాచి కట్టి ఉండడం, కుక్క అడ్డురావడంతో బైకు అదుపుతప్పి భార్య భర్త కిందపడ్డారు. రెడ్డి శేఖర్‌రెడ్డి తలకు తీవ్ర గాయాలు కాగా, పవిత్రకు స్వల్ప గాయాలయ్యాయి. పవిత్ర తన తల్లిదండ్రులకు  సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి రెడ్డిశేఖర్‌రెడ్డిని చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పవిత్ర అక్కడే చికిత్స పొందుతోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెడ్డిశేఖర్‌రెడ్డి కడపలో నివాసం ఉంటూ గ్యారేజీలో ఆర్టీసీ ఎంప్లాయ్‌గా పనిచేస్తున్నాడు. అనంతపురంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. చక్రాయపేట పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.  

Updated Date - 2021-10-18T05:41:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising