రూ.15 వేలు ఆర్థికసాయం
ABN, First Publish Date - 2021-05-07T04:52:53+05:30
కడపకు చెందిన సీనియర్ జర్నలిస్టు కేవీఎ్సఎం రఘునాథ్ కుటుంబానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్శర్మ రూ.15 వేలు ఆర్థికసాయం ప్రకటించారు. కరోనా కారణంగా రఘునాథ్ బుధవారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సాయినాథశర్మ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కమలాపురం(రూరల్), మే 6: కడపకు చెందిన సీనియర్ జర్నలిస్టు కేవీఎ్సఎం రఘునాథ్ కుటుంబానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్శర్మ రూ.15 వేలు ఆర్థికసాయం ప్రకటించారు. కరోనా కారణంగా రఘునాథ్ బుధవారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సాయినాథశర్మ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతితో ఫోన్లో మాట్లాడుతూ తాను అనారోగ్య కారణంగా హైదరాబాదులో చికిత్స పొందుతున్నానని, తన అనుచరుల ద్వారా ఆర్థికసాయం అందజేస్తున్నట్లు తెలిపారు. కాగా రఘునాథ్ అకాల మరణం పత్రికా రంగానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రఘనాథ్ మృతి బాధాకరం
కడప(మారుతీనగర్), మే 6: సీనియర్ పాత్రికేయుడు రఘనాథ్ కరోనాతో మృతి చెందడం బాధాకరమని విద్వాన్ గానుగపెంట హనుమంతరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.
Updated Date - 2021-05-07T04:52:53+05:30 IST