పర్యావరణాన్ని రక్షించే పరిశోధనలు అవసరం
ABN, First Publish Date - 2021-02-25T05:22:26+05:30
పర్యావరణాన్ని పరిరక్షించే సరికొత్త పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్లోని కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఏకాంబరబలరామన్ అన్నారు.
కడప(వైవీయూ), ఫిబ్రవరి 24: పర్యావరణాన్ని పరిరక్షించే సరికొత్త పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్లోని కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఏకాంబరబలరామన్ అన్నారు. వైవీయూలో సైన్స్ ఉత్సవాల్లో భాగంగా కెమిస్ట్రీ ఆధ్వర్యంలో శాస్త్రీయ ఉపన్యాస కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. వీసీ సూర్యకళావతి మాట్లాడుతూ పరిశోధనలో కెమిస్ట్రీ విభాగం కీలకపాత్ర పోషిస్తుందని, పరిశోధనలవైపు విద్యార్థులు దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో కెమిస్ట్రీఅధ్యాపకులు, ప్రిన్సిపాల్ సాంబశివారెడ్డి, రిజిస్ట్రార్ విజయరాఘవప్రసాద్ పాల్గొన్నారు.
Updated Date - 2021-02-25T05:22:26+05:30 IST