వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ
ABN, First Publish Date - 2021-04-17T05:09:02+05:30
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.
పులివెందుల, ఏప్రిల్ 16: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో గత ఆరు రోజులుగా సీబీఐ బృందం పలువురిని విచారిస్తోంది. ఈ మేరకు శుక్రవారం వివేకానందరెడ్డి కారు డ్రైవర్ దస్తగిరి తల్లిదండ్రులు హాజీవలి, మస్తానమ్మను సీబీఐ విచారించింది. హాజీవలి కదిరిలో ఓ దుకాణం నిర్వహిస్తున్నందున సీబీఐ అధికా రులు అతనిని కదిరికి తీసుకెళ్లినట్లు సమాచారం. దస్తగిరిని సీబీఐ అధికారులు ఢిల్లీ తీసుకెళ్లి విచారిస్తున్నారు.
Updated Date - 2021-04-17T05:09:02+05:30 IST