వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యం : కమిషనర్
ABN, First Publish Date - 2021-10-22T04:54:10+05:30
ఎర్రగుంట్ల నగర పంచాయతీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యం గా పనిచేస్తున్నట్లు కమిషనర్ పి.జగన్నాథ్ పేర్కొన్నారు.
ఎర్రగుంట్ల, అక్టోబరు 21: ఎర్రగుంట్ల నగర పంచాయతీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యం గా పనిచేస్తున్నట్లు కమిషనర్ పి.జగన్నాథ్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఎర్రగుంట్లలో సిబ్బంది వేస్తున్న వ్యాక్సినేషన్ను పరిశీలించారు. పట్టణంలో ఇప్పటికే మొదటి డోస్ 90శాతం మందికి వేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్పై అపోహలు నమ్మవద్దన్నారు. వ్యాక్సిన్ వేయించడం ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది బాధ్యతగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-10-22T04:54:10+05:30 IST