చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ABN, First Publish Date - 2021-10-30T04:53:52+05:30
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జమ్మలమడుగు బార్ అసోసియేషన్ కమిటీ న్యాయవాదులు జాకీర్, జయన్నలు సూచించారు.
జమ్మలమడుగు రూరల్, అక్టోబరు 29: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జమ్మలమడుగు బార్ అసోసియేషన్ కమిటీ న్యాయవాదులు జాకీర్, జయన్నలు సూచించారు. శుక్రవారం మండలంలోని గూడెం చెరువు గ్రామంలో జడ్జి బాబాఫకృద్దీన్ ఆదేశాల మేరకు న్యాయసదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు భవన నిర్మాణాలు , నిరక్షరాస్యత, మహిళా సమస్యలపై వివరించారు. ఈ కార్యక్రమాలు నవంబరు 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
Updated Date - 2021-10-30T04:53:52+05:30 IST