పిడుగుపాటుతో గృహవిద్యుత్ సామగ్రి నష్టం
ABN, First Publish Date - 2021-10-30T04:57:28+05:30
పిడుగు పాటుతో ఇళ్లల్లోని విద్యుత్ సామగ్రి నష్టం వాటిల్లి నట్లు ప్రజలు వివరిస్తున్నారు.
గ్రామాన్ని సందర్శించిన తహసీల్దారు
బ్రహ్మంగారిమఠం, అక్టోబరు 29: పిడుగు పాటుతో ఇళ్లల్లోని విద్యుత్ సామగ్రి నష్టం వాటిల్లి నట్లు ప్రజలు వివరిస్తున్నారు. పలుగురాళ్లపలె ఎస్సీ కాలనీలో శుక్రవారం ఉదయం వర్షం పడుతుండగా పిడుగు పడడంతో ఎర్రంపలె ్ల వీరయ్య ఇంటి లోపల టీవీ పూర్తిస్థాయిలో పగిలిపోయింది. భాగ్యమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బి.మఠం తహసీల్దారు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామాన్ని, పరిసరాలను, రోడ్లను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలకు తెలిపారు.
Updated Date - 2021-10-30T04:57:28+05:30 IST