ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకతాయిలు అవమానకరంగా మాట్లాడారని.. అవమానం భరించలేక..

ABN, First Publish Date - 2021-01-17T05:18:11+05:30

తమ కుమార్తె పట్ల కొందరు ఆకతాయిలు..

బావిలో దూకి మృతి చెందిన లక్ష్మీభార్గవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బావిలో దూకిన తల్లీకూతుళ్లు

కుమార్తె మృతి, చెట్టుకొమ్మకు తగులుకున్న తల్లి



బ్రహ్మంగారిమఠం(కడప): తమ కుమార్తె పట్ల కొందరు ఆకతాయిలు అవమానకరంగా మాట్లాడారనే మనస్థాపంతో తల్లీకూతుళ్లు బావిలో దూకగా తల్లి చెట్టుకొమ్మకు ఇరుక్కుని బయటపడగా కుమార్తె లింగాలదిన్నె లక్ష్మీభార్గవి (16) బావిలో పడి మృతి చెందింది. బి.మఠం ఎస్‌ఐ శ్రీనివాసులు వివరాల మేరకు... బ్రహ్మంగారిమఠం మండలం లింగాలదిన్నెకు చెందిన లక్ష్మీనారాయణరెడ్డి, రమణమ్మల కుమార్తె లక్ష్మీభార్గవి పట్ల కొందరు యువకులు అవమానకరంగా వ్యవహరించారని తల్లికి చెప్పి బాధపడింది. దీంతో అవమానం భరించలేక తల్లి రమణమ్మ, కుమార్తె లక్ష్మీభార్గవి ఇద్దరూ శుక్రవారం రాత్రి వారి పొలంలోని బావిలో దూకారు.


అయితే తల్లి రమణమ్మ బావిలో ఉన్న చెట్టుకొమ్మకు ఇరుక్కుపోగా, కుమార్తె నీళ్లలో పడిపోయింది. దీంతో తల్లి పెట్టిన కేకలతో చుట్టుపక్కల వారు బావి నుంచి వస్తున్న కేకల ఆధారంగా చెట్టుకొమ్మల్లో ఇరుక్కున్న రమణమ్మను బయటకు తీశారు. చీకటి కావడంతో నీళ్లలో పడిన కుమార్తెను బయటకు తీయలేకపోయారు. శనివారం ఉదయం మృతదేహం బయటకు తేలియాడడంతో పోలీసులు బయటకు తీశారు. ఈ సంఘటనకు కారణమైన ఎనిమిది మందిపై మృతురాలి తల్లి రమణమ్మ, తండ్రి లక్ష్మీనారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు 306/109 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బద్వేలుకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-01-17T05:18:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising