వివాహిత ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-10-26T04:50:22+05:30
మండలంలోని సంగంవారిపల్లె పంచాయతీ రాగిమానుదిన్నెపల్లెకు చెందిన పురుం స్వర్ణలత (21) అనే వివాహిత విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకుంది.
వీరబల్లి, అక్టోబరు 25: మండలంలోని సంగంవారిపల్లె పంచాయతీ రాగిమానుదిన్నెపల్లెకు చెందిన పురుం స్వర్ణలత (21) అనే వివాహిత విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇంటిలో గొడవలు, అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే భర్త లోకనాధ్ ఆమెను రాయచోటిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహమ్మద్రఫీ తెలిపారు. మృతి చెందిన స్వర్ణలతకు పిల్లలు లేరన్నారు.
Updated Date - 2021-10-26T04:50:22+05:30 IST