ఎర్రగుంట్లలో 4లేన్ల రోడ్డుకు మార్కింగ్
ABN, First Publish Date - 2021-01-22T04:56:44+05:30
నగరపంచాయతీలో నాలుగులేన్ల రోడ్డు నిర్మాణానికి నేషనల్ హైవే అధికారులు గురువారం మార్కింగ్ ఇచ్చారు.
ఎర్రగుంట్ల, జనవరి 21: నగరపంచాయతీలో నాలుగులేన్ల రోడ్డు నిర్మాణానికి నేషనల్ హైవే అధికారులు గురువారం మార్కింగ్ ఇచ్చారు. ఆక్రమణలు ఉన్న చోట తొలగించుకునేందుకు వారంరోజులు గడువు ఇచ్చినట్లు ఎన్హెచ్ ఏఈ దీపక్రెడ్డి తెలిపారు. ఇందుకు సంబందించిన నగరపంచాయతీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఒకటి రెండురోజుల్లో నోటీసులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జనవరి నెలాఖరుకు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో పనులు ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. ఎర్రగుంట్ల -కడప రోడ్డులోని జువారీ రైల్వే బ్రిడ్జి నుంచి ఐసీఎల్ కర్మాగారం చివరలో ఉన్న సుంకులమ్మ గుడికి 50మీటర్ల దూరం వరకు ఈరోడ్డును నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ లైటింగ్ ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం.
Updated Date - 2021-01-22T04:56:44+05:30 IST