ప్రాణం తీసిన సరదా
ABN, First Publish Date - 2021-10-17T04:51:52+05:30
దసరా సందర్భంగా మిత్రులతో కలిసి సరదాగా నదికి వెళితే మహేంద్రకర్ గోకుల్కుమార్ (14) గల్లంతయ్యాడు.
జమ్మలమడుగు రూరల్, అక్టోబరు 16: దసరా సందర్భంగా మిత్రులతో కలిసి సరదాగా నదికి వెళితే మహేంద్రకర్ గోకుల్కుమార్ (14) గల్లంతయ్యాడు. గూడుమస్తాన్వల్లి దర్గా, శివాలయం సమీపాన శుక్రవారం సాయంత్రం మార్వాడీ వీధి వాసి మహేంద్రకర్ గోకుల్కుమార్ కొందరు మిత్రులతో కలిసి పెన్నానదికి వెళ్లారు. అక్కడ అతను నీటిలో పడిపోవడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు జమ్మలమడుగు అర్బన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అప్పటికే పెన్నానదిలో గల్లంతైన యువకుడిని స్థానికుల సహకారంతో బయటకు తెచ్చారు. విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2021-10-17T04:51:52+05:30 IST