వైసీపీ వైఫల్యాలను ఎండగడతాం
ABN, First Publish Date - 2021-07-25T04:58:34+05:30
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్షనాయుడు ధ్వజమెత్తారు
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్షనాయుడు
సుండుపల్లె, జూలై24: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్షనాయుడు ధ్వజమెత్తారు. శనివారం బీజేపీ మండల అధ్యక్షుడు స్వగృహంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, ఇది తగదన్నారు. ఈ నెల 26వ తేదీన ఒంటిమిట్ట ఆలయాన్ని సందర్శించి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియజేస్తామని వివరించారు. అదేవిధంగా ఓబీసీ అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా పెద్దపల్లి అశోక్, యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నాగరాజు, కిసాన్మోర్చా అధ్యక్షుడిగా సుబ్బరామరాజును ప్రకటించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రమణనాయుడు, బీజేపీ నాయకులు సుబ్బరాజు, గోపాల్రాజు, వెంకట్రామరాజు, చిన్న పాల్గొన్నారు.
Updated Date - 2021-07-25T04:58:34+05:30 IST