కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం...
ABN, First Publish Date - 2021-06-15T14:58:40+05:30
జిల్లాలోని పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో కాల్పుల కలకలం రేగింది.
కడప: జిల్లాలోని పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో కాల్పుల కలకలం రేగింది. వైసీపీ నేత ప్రసాద్ రెడ్డి లైసెన్స్డ్ తుపాకితో పార్థసారథి రెడ్డిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన పార్థసారథి రెడ్డి ఘటనా స్ధలంలోనే మృతి చెందాడు. కాల్పులు జరిపిన ప్రసాద్ రెడ్డి కూడా తనని తాను తపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత గొడవులే కారణమని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-06-15T14:58:40+05:30 IST