మైదుకూరులో టీడీపీ నేతలపై కేసులు నమోదు
ABN, First Publish Date - 2021-03-08T14:21:16+05:30
మైదుకూరులో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
కడప: మైదుకూరులో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మున్సిపల్ చైర్మెన్ టీడీపీ అభ్యర్థి జగన్ అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. విధులకు ఆటంకం కలిగించారని టీడీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. పుట్టాసుధాకర్ యాదవ్, రెడ్డ్యం వెంకటసుబ్బారెడ్డి సహా మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Updated Date - 2021-03-08T14:21:16+05:30 IST