జీపు డ్రైవరు మృతి
ABN, First Publish Date - 2021-03-07T04:53:29+05:30
స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్దనున్న జీపు స్టాండు వద్ద జీపు డ్రైవరు వెంకటకు ళాయప్ప (చిన్న) (42)ను హత్య చే శారని మృతుని భార్య పుష్ప పోలీసు లకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు వి వరాల్లోకె ళితే...
హత్య చేశారని ఫిర్యాదు చేసిన భార్య
పులివెందుల టౌన, మార్చి 6: స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్దనున్న జీపు స్టాండు వద్ద జీపు డ్రైవరు వెంకటకు ళాయప్ప (చిన్న) (42)ను హత్య చే శారని మృతుని భార్య పుష్ప పోలీసు లకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు వి వరాల్లోకె ళితే...
రాఘవేంద్ర స్వామి వీధి వాసి వెంకట కుళాయప్ప (చిన్న) జీపు డ్రైవర్గా పనిచేస్తు న్నాడు. శనివారం ఉదయం 10:50గంటలకు భర్త సెల్ ఫోన నుంచి ఒక వ్యక్తి ఫోన చేసి నీ భర్త ఆస్పత్రిలో ఉన్నాడని భార్యకు చెప్పాడు. అంతలో ఆమె కొడుకు నిఖిల్ ఫోన చేసి నాన్న చనిపోయాడని చెప్పారు. ఆమె వెంటనే గంగిరె డ్డి ఆస్పత్రి వద్దకు వెళ్లి ఎలా చనిపోయాడని కొడుకును అడగ్గా జీపుల స్టాండ్ వద్ద బాబు అనే వ్యక్తి నాన్నతో గొడవపడి గొంతునులిమి, ముఖం మీద బలంగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపో యాడని చెప్పాడు. అక్కడి నుంచి మృతదేహాన్ని పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మార్చు రీ గదికి తరలించారు. భాదితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - 2021-03-07T04:53:29+05:30 IST