రైతుల ఆత్మహత్యలపై విచారణ
ABN, First Publish Date - 2021-01-19T05:06:58+05:30
గత ఏడాది మండలంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను అధికారులు విచారించారు.
లింగాల, జనవరి 18: గత ఏడాది మండలంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను అధికారులు విచారించారు. సోమవారం జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న, తహసీల్దార్ ఆంజనేయులు, ఏడీఏ రమణారెడ్డి తదితరులు ఆయా గ్రామాల్లో విచారణ చేపట్టారు. దొండ్లవాగు గ్రామంలో అమర్నాథరెడ్డి, వెలిదండ్ల గ్రామంలో చెన్నారెడ్డి, హిరోజిపురంలో ప్రతాపరెడ్డిల కుటుంబ సభ్యులను వారు విచారించారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పంటల సాగు, అప్పుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నివేదికను కలెక్టర్కు పంపుతామని తెలిపారు.
Updated Date - 2021-01-19T05:06:58+05:30 IST