స్పందన అర్జీల పరిష్కారానికి చొరవ
ABN, First Publish Date - 2021-06-20T05:02:37+05:30
స్పందనకు వచ్చే అర్జీలను త్వరగా పరిష్కరించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంయుక్త సంచాలకులు మొగిలిచెండు సురేష్ తెలిపారు.
కడప రూరల్, జూన్ 19 : స్పందనకు వచ్చే అర్జీలను త్వరగా పరిష్కరించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంయుక్త సంచాలకులు మొగిలిచెండు సురేష్ తెలిపారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన జడ్పీ సీఈవో సుధాకర్రెడ్డితో చర్చించారు. స్పందన అర్జీల పరిష్కారంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సత్వరమే స్పందించి పరిష్కారానికి తగు చర్యలు తీసుకొనేందుకు కార్యాచరణ చేపట్టాలని జడ్పీ సీఈవోను కోరారు.
Updated Date - 2021-06-20T05:02:37+05:30 IST