ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాకు చెప్పకుండా ఎలా ఏకగ్రీవం చేసుకుంటారు?

ABN, First Publish Date - 2021-03-07T05:35:48+05:30

తమకు చెప్పకుండా, తమ అభిప్రాయాలు కనుక్కోకుండా వార్డులను ఎలా ఏకగ్రీవం చేసుకుంటారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం జమ్మలమడుగు వైసీపీ కార్యాలయాన్ని 18వ వార్డుకు చెందిన మహిళలు ముట్టడించారు.

జమ్మలమడుగు వైసీపీ కార్యాలయానికి వచ్చిన మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ కార్యాలయాన్ని ముట్టడించిన మహిళలు

జమ్మలమడుగు రూరల్‌, మార్చి 6: తమకు చెప్పకుండా, తమ అభిప్రాయాలు కనుక్కోకుండా వార్డులను ఎలా ఏకగ్రీవం చేసుకుంటారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం జమ్మలమడుగు వైసీపీ కార్యాలయాన్ని 18వ వార్డుకు చెందిన మహిళలు ముట్టడించారు. జమ్మలమడుగు నగర పంచాయతీకి ఈనెల 10వ తేదీ పోలింగ్‌ జరుగనుంది. నగర పంచాయతీలోని 18, 19 వార్డులకు సంబంధించి ఇతరులను వైసీపీ బెదిరించి ఏకగ్రీవం చేసుకున్నారని, ఎవరికీ చెప్పకుండా ఏకగ్రీవాలు చేసుకోవడం దారుణమని వాపోయారు. ఆఫీసు వద్దకు తాము వస్తే సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వాహనం ఎక్కి వెళ్లిపోయారని వాపోయారు. రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును ఏకగ్రీవం పేరుతో కాలరాస్తారా అంటూ నిలదీశారు. ఈ వ్యవహారంపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-03-07T05:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising