ఇల్లు కూలి వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2021-06-23T05:27:05+05:30
కూతురిని చూసేందుకు వచ్చిన తండ్రి ఇల్లు కూలడంతో మృతిచెందిన ఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.
మైలవరం, జూన్ 22 : కూతురిని చూసేందుకు వచ్చిన తండ్రి ఇల్లు కూలడంతో మృతిచెందిన ఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే మండల పరిధిలోని దుగనపల్లి గ్రామంలో కె.మరియమ్మకు చెందిన ఇల్లు వానకు తడిసి సోమవారం రాత్రి హఠాత్తుగా కూలిపోయింది. దీంతో మరియమ్మ స్వల్పగాయాలతో బ యటపడగా ఆమె కూతురు సుప్రియ (13), ఆమె తండ్రి కుందవరం కమ్మన్న (60) తీవ్ర గాయాలవ్వగా జమ్మలమడుగు హాస్పిటల్కు తరలించారు. మెరుగైన చికిత్సల నిమిత్తం కర్నూల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు సర్పంచ్, వీఆర్వో పుల్లయ్య తెలిపారు. కర్నూల్ జిల్లా, దొర్నిపాడు మండలం క్రిష్టిపాటి గ్రామానికి చెందిన కుందవరం కమ్మన్న కూతురైన మరియమ్మను దుగనపల్లి గ్రామానికి చెం దిన జయన్నతో వివాహం జరిపించారు. జయన్న కొన్ని నెలల క్రితం మృతి చెందడంతో మరియమ్మ, ఆమె కూతురు సుప్రియ నివాసం ఉంటున్నారు. ఆ క్రమంలో మరియమ్మను చూసేందు కు కమ్మన్న దుగనపల్లికు వచ్చాడని ఇల్లు కూలడంతో రాళ్లన్ని కమ్మన్నపై పడటంతో గమనించిన స్ధానికులు వెంటనే వాటిని తొలగించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా కమ్మనను మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలిస్తుండగా మృతి చెందినట్లు సర్పంచ్ శైలజ సుధాకర్ , వీఆర్వో పుల్లయ్య లు తెలిపారు. సర్పంచ్ రూ.5 వేలు సాయమందించారు.
Updated Date - 2021-06-23T05:27:05+05:30 IST