విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోని ప్రభుత్వం: ఏబీవీపీ
ABN, First Publish Date - 2021-02-25T04:28:04+05:30
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల మోజులో విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసిందని ఏబీవీపీ పట్టణ కార్యదర్శి గురుప్రసాద్ ధ్వజమెత్తారు.
జమ్మలమడుగు రూరల్, ఫిబ్రవరి 24: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల మోజులో విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసిందని ఏబీవీపీ పట్టణ కార్యదర్శి గురుప్రసాద్ ధ్వజమెత్తారు. బుధవారం జమ్మలమడుగు ఏబీవీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు చదువు దూరం చేస్తోందన్నారు. డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమైనా విద్యార్థులకుగానీ, ఉపాధ్యాయులకు కానీ ఎటువంటి స్పష్టత లేకపోవడం బాధాకరమన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి జగన్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. రాజన్న రాజ్యం అంటే ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు. ఏబీవీపీ కార్యదర్శి రాకేష్, వెంకట్ పాల్గొన్నారు.
Updated Date - 2021-02-25T04:28:04+05:30 IST