ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తదానంతో ప్రాణదాతలు కండి

ABN, First Publish Date - 2021-10-22T04:51:21+05:30

రక్తదానంతో ప్రాణదాతలు కావాలని ప్రొద్దుటూరు డీఎస్పీ వై.ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు.

రక్తదానం చేస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు డీఎస్పీ వై.ప్రసాదరావు


ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 21 : రక్తదానంతో ప్రాణదాతలు కావాలని ప్రొద్దుటూరు డీఎస్పీ వై.ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయ ఆవరణలో పోలీసు అధికారులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో డీఎస్పీ ప్రసాదరావు, వన్‌టౌన్‌ సీఐ ఎన్‌వి నాగరాజు, పోలీసు సిబ్బందితో పాటు స్టార్‌ ఫౌండేషన్‌ తరుపున యువకులు రక్తదానం చేశారు. అంతకు ముందు డీఎస్పీ మాట్లాడుతూ రక్తదానంపై చాలా మందిలో అపోహలు ఉన్నాయని, వాటిలో ఏమాత్రం నిజం లేదన్నారు. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన బ్లడ్‌ యూనిట్లు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో బ్లడ్‌బ్యాంకు సిబ్బంది, పోలీసు సిబ్బంది, స్టార్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులు సిరాజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-22T04:51:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising